Madhuranagarilo March 30 2024 Episode 326: అన్న తొందరగా పోనీ అన్న అని రాదా అంటుంది. వెళ్తున్నాం అమ్మ అని ఆటో డ్రైవర్ అంటాడు. కట్ చేస్తే రుక్మిణ శ్యామ్ ముద్దు పెట్టబోతుండగా దాక్షాయిని వచ్చి డోర్ కొట్టి తలుపు తీయమ్మ రుక్మిణి అని అంటుంది. కోపంతో డోర్ తీసిన రుక్మిణి ఏంటి పిన్ని పానకంలో పుడకలాగా అని రుక్మిణి అంటుంది. నేను పానకంలో పుడుకను కాదమ్మా మీ చెల్లె పాలలో నలకలాగా వచ్చి డోర్ కొడుతుంది తనకు సమాధానం చెప్పి పంపించే అని దాక్షాయిని అంటుంది. నేను ఇప్పుడు రాను పడుకున్నాను అని చెప్పి పంపించేయని రుక్మిణి చెబుతుంది. నేను చెబితే మీ చెల్లెలు వినట్లేదు నువ్వే వచ్చి చెప్పి వెళ్ళగొట్టు అని దాక్షాయిని అంటుంది. కట్ చేస్తే, ఏంటి నువ్వు నా ఇంటికి వచ్చావు అని రుక్మిణి అంటుంది. మా ఆయన కోసం వచ్చాను అని రాదా అంటుంది. మీ ఆయన నా దగ్గర ఎందుకు ఉంటాడు అని రుక్మిణి అంటుంది.
వాడు నీకు కూడ భర్త కదమ్మా అందుకే మర్చిపోయి వచ్చాడేమో అని ధనంజయ్ అంటాడు.మా ఆయన ని పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని రాధా అంటుంది. ఆయన నీ కంటే ముందు నాకు భర్త నీకంటే ముందే నా మెడలో తాళి కట్టాడే నీకు ఆయన మీద కంటే నాకు ఎక్కువ హక్కు ఉంటుంది అని రుక్మిణి అంటుంది. నా కంటే ముందు ఆయన నీ మెడలో తాళికట్టొచ్చు కానీ ఆయన మీద నీకు ప్రేమ లేదు పెళ్లి అయిన నెల రోజులకే ఆయనను వదిలేసి వెళ్లిపోయావు నాకు ఆయన మీద హక్కు ఉంటుంది అని రాధా అంటుంది. మావయ్య ఏ రూమ్ లో ఉన్నాడో వెతుకుదం పదండి అని రాదా ధనంజయ్ వెళ్లి రూమ్ లో వెతుకుతారు. కట్ చేస్తే, శ్యామ్ పడుకొని ఉంటాడు మొహం నిండా మల్లెపూలు కనపడతాయి అవి చూసి వాటిని తీసేసి రాధా శ్యామ్ ని లేపుతుంది. రాధా నాకు బాగా నిద్ర వస్తుంది పడుకో నువ్వు డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి అని శ్యామ్ అంటాడు.
ఇది మన ఇల్లు కాదు మనం ఇంటికి వెళ్ళాక పడుకుందువు గాని పద అని రాధ లేపి కిందికి తీసుకొస్తుంది. అంటే ఇప్పటిదాకా మీ మధ్య ఏమి జరగలేదా అని దాక్షాయిని అంటుంది. మా మధ్య ఏం జరిగిందని ఈలోపే నువ్వు వచ్చి డోర్ కొట్టావు అని రుక్మిణి అంటుంది. పరాయి ఆడదాని భర్తతో సంసారం చేస్తే దాన్ని సంసారం అనరు ఏమంటారు నీవు ఓకే వదిలేస్తున్నాను ఇలాంటి పిచ్చి పనికి ఒడిగట్టావా నా ఆస్తి జోలికి వచ్చిన ఊరుకున్నాను కానీ నా భర్త జోలికి నా కొడుకు జోలికి వస్తే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను నీ అంత చూస్తాను అంటూ రాధా శ్యామ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎంతో పథకం పకారం ఆయనని సొంతం చేసుకొని ఆస్తి నా దగ్గరే ఉంటుంది నా భర్త నా బిడ్డ నా తోటే ఉంటారు అనుకుంటే నా ప్రాణం అంతా పాడైపోయింది అని రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. కట్ చేస్తే, ఏంటి రాధా వాళ్ళ ఇంకా రాలేదు అని మధుర ఆలోచిస్తూ ఉండగా రాధా శ్యామ్ ని తీసుకొని ఇంటికి వస్తుంది.
రేయ్ శ్యామ్ ఏమైందిరా నీకు ఎందుకిలా ఉన్నావ్ అని మధుర అడుగుతుంది. ఆ మాట ఆయనని అడగత్తయ అని రాదా వెళ్లి బాధపడుతుంది.అమ్మ ఇంకెప్పుడు ఇలా తాగను మర్చిపోయి ఆ ఇంటికి వెళ్లాను అని శ్యామ్ అంటాడు. నువ్వు మందు తాగడం ఏంట్రా మర్చిపోయా ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి అని మధుర అంటుంది. అలవాటు ప్రకారం తాగిన మత్తులో వెళ్లిపోయానమ్మ సారీ అని శ్యామ్ అంటాడు. ఆ మాట మాకు కాదురా రాధకి చెప్పు తను బాధపడుతుంది అని ధనంజయ్ అంటాడు. సారీ రాధా ఇంకెప్పుడు ఇలా తాగి ఇలా మర్చిపోయి అక్కడికి వెళ్ళను నిన్ను బాధ పెట్టను అని శ్యామ్ అంటాడు. మీరు తాగిన మత్తులో ఉండగా నిన్ను లొంగదీసుకోవాలని చూస్తుందండి
మా అక్క ఆల్రెడీ పండు ని దాని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇప్పుడు మిమ్మల్ని సొంతం చేసుకొని నా నుండి మిమ్మల్ని పండుని దూరం చేయాలని చూస్తుంది మీరిద్దరూ నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేనండి నేను ఒంటరిదాన్ని అయిపోతాను అని రాదా బాధపడుతుంది. రాధా ఇకమీదట మందు తాగను నీ మీద ఒట్టు తాగిన తాగకపోయినా ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను నీ మీద ఒట్టు అని ప్రమాణం చేస్తాడు శ్యామ్. కట్ చేస్తే, శ్యామ్ ఒక చోటకి కిరాయికి వెళ్తాడు. అక్కడే వంటలు చేయడానికి మధుర వెళుతుంది. అందరితో పాటు మధుర కూడా వంటగినెలు కడుగుతూ ఉంటుంది.
వాళ్లకు పని చెప్పిన మేస్తిరి అమ్మ కూరగాయలు ఆటోలో ఉన్నాయి దించండి అని చెప్పడంతో మధుర కూరగాయలు దించడానికి వెళ్తుంది. శ్యామ్ ఆటోలో కూరగాయ మూటన్ని అందరికీ ఎత్తుతూ కనిపిస్తాడు. శ్యామ్ ని చూసి మధుర షాక్ అవుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది