చాల మంది భోజనం చేశాక అనేక రకాల పను లు చేస్తుంటారు. అయితే మనం భోజనం చేశాక ఎట్టి పరిస్థితులలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవిఏమిటో , వాటి వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
భోజనం చెయ్యడం పూర్తి కాగానే స్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తే జీర్ణ ప్రక్రియకు ఆటంకం రావడం తో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, అసిడిటీ రావడానికి కారణమవుతుంది. ఒక వేళా భోజనం చేశాక స్నానం చేయాలనుకుంటే కనీసం 40 నిమిషాల తర్వాత చేయడం ఉత్తమం. ఇలా చేయడం వలన ఆరోగ్యం పై అంత ప్రభావం పడకుండా ఉంటుంది.
భోజనం చేశాక అస్సలు పొగ తాగకూడదు. ఒక వేళా అలా చేస్తే పొగాకు లో ఉండే నికోటిన్ మన శరీరం లో జరిగే జీర్ణ క్రియనుసక్రమంగా జరగ నివ్వదు. అంతే కాకుండా శరీరం క్యాన్సర్ కణాలను గ్రహించి క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కనుక భోజనం చేశాక పొగ తాగకూడదు.ఒకవేళ అలాంటి అలవాటు ఉంటె వెంటనే మానుకోండి.
భోజనం చేశాక గ్రీన్ టీతాగ కూడదు. తాగితే శరీరం మనం తిన్న ఆహారం లో ఉండే ఐరన్ను సరిగ్గా గ్రహించలేదు. కనుక భోజనం చేశాక గ్రీన్ టీ మాత్రమే కాదు కాఫీ టీ,లు కూడా తాగకూడదు.
చాలా మంది భోజనం చేసిన వెంటనే పండ్లనుతింటుంటారు . కానీ అలా చేయకూడదు . మనం తిన్న ఆహారం లో ఉండే పోషకాలను శరీరం బాగా గ్రహించాలంటే పండ్లను తీసుకోకూడదు . ఒకవేళ పండ్లను తినాలంటే భోజనం చేశాక కనీసంఒక గంట తర్వాత తినేలా చూసుకోవాలి . గంట తర్వాత పండ్లను తింటే ఆరోగ్యానికి ఏమీ కాదు.
భోజనం చేయగానే వ్యాయామం చేయకూడదు. ఎక్కువ సేపు కూర్చొని కూడా ఉండరాదు . కొంత సమయం అటు, ఇటు నడవాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వంటివి కూడా చేయకూడదు .అలా చేయడం వలన గ్యాస్ వస్తుంది.బాగా బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది .