(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : ఆచార్య నాగార్జున యూనివర్సీటీ యాజమాన్యం ఎట్టకేలకు నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. హాస్టల్ నుండి విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున గుంటూరులో ధర్నాకు పిలుపునివ్వడంతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఎఎన్ యు యాజమాన్యం విద్యార్థుల సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారన్న కారణంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆశీర్వాదం, నవీన్, రాజు, ఏడుకొండలు అనే విద్యార్థులను హాస్టల్ నుండి శనివారం రాత్రి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.