(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ముందు ఏపి న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ న్యాయవాదులు నినాదాలు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఏపి అసెంబ్లీ ఆమోదంచి శాసనమండలికి పంపిన నేపథ్యంలో బుధవారం పలువురు న్యాయవాదులు హైకోర్టు ఎదుట తమ నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులు రాజ్యంగ విరుద్ధమనీ, వీటిపై హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అంత మంది సలహాదారులను పెట్టుకున్నా మంచి సలహాలు ఎవ్వరూ ఇవ్వడం లేదని అన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యాంగం, చట్టాల గురించి అవగాహన చేసుకోవాలని సూచించారు.