Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం గ్రాండ్ గా విశాఖపట్నంలో ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. దారి పొడవునా పూలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుండి హోటల్ దాకా బన్నీ కారు వెంబడించారు. అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ వైజాగ్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. దాదాపు పది రోజులపాటు విశాఖపట్నంలో సినిమా షూట్ జరగనుందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తోంది.
2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆ సమయంలో ఊహించని విజయం సాధించింది. తెలుగులోనే ప్రమోషన్స్ చేశారు. కానీ హిందీలో 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. పైగా “పుష్ప” చిత్రానికి గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అల్లు అర్జున్ గెలుచుకున్నారు. మ్యూజిక్ కి సంబంధించి దేవిశ్రీప్రసాద్ కూడా జాతీయ అవార్డు అందుకున్నారు. దీంతో సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆల్రెడీ ఆగస్టు 15వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దీంతో షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలతో పాటు జాతరకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ఓ సాంగ్ కూడా షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైజాగ్ లో మరికొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొని జూన్ కల్లా కంప్లీట్ చేయాలని జులై నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. ఆ దిసగానే ఇప్పుడు షూటింగ్ వేగవంతంగా జరుపుకుంటుంది.