Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవలె భార్య ఐశ్వర్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల పాటు ఎంతో అనోన్యంగా ఉన్న ఈ జంట.. ఇప్పుడు అనూహ్యంగా విడిపోబోతున్నట్లు ప్రకటించారు. అసలు వీరు ఎందుకు విడిపోయారు అన్నది తెలీక పోయినా.. ధనుష్, ఐశ్వర్యల విడాలకు మ్యాటర్ మాత్రం అటు ప్రధాన మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.
ఇదిలా ఉంటే.. ధనుష్కి సంబంధించి మరో ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. అదే ధనుష్ కొత్తిల్లు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మొన్నటిదాకా భార్య ఐశ్వర్యతో కలిసే ఉన్నాడు ధనుష్. అయితే, ఇప్పుడు ఆమెతో విడిపోవడం వల్ల.. ఆయన తన కోసం ఓ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడట.
చెన్నైలోని ఖరీదైన ఏరియాలో ఆ ఇంటి నిర్మాణం చేపట్టారట. అత్యంత విలాసంగా, ధనుష్ అభిరుచులకు తగ్గట్లుగా ఈ ఇల్లును నిర్మిస్తున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కొత్తింటి కోసం ధనుష్ ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు పెడుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. కోలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ధనుష్ త్వరలోనే టాలీవుడ్లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో `సార్` అనే సినిమాను ప్రకటించిన ధనుష్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ మూవీని ప్రకటించాడు. త్వరలోనే ఇదీ సెట్స్ మీదకు వెళ్లనుంది.