Allu Arjun: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజ హెగ్డే చాలామందికి లక్కీ హీరోయిన్. కరోనా రాకముందు వరకు పూజ నటించిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. కానీ కరోనా తర్వాత ఆమె నటించిన అనేక సినిమాలు బోల్తాపడ్డాయి. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. అదే సమయంలో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా ఉండే పూజ హెగ్డే గత కొన్నాళ్లుగా… సినిమాలు లేక సతమతమవుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా ఉపయోగించుకుని తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది.
ఇలాంటి పరిస్థితులలో పూజా హెగ్డేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్ నెలలో అల్లు అర్జున్ బర్త్ డే నాడు అనగా 8వ తారీకు అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
ఇప్పటికే మేకర్స్ పూజ హెగ్డేని సంప్రదించినట్లు సమాచారం. గతంలో అలా వైకుంఠపురంలో, దువ్వాడ జగన్నాథం రెండు సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే మరో అవకాశం అందుకున్నట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ “పుష్ప” సెకండ్ పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.