(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీనగర్:జమ్మూకశ్మీర్లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని ఆర్మీ అధికారులు చెప్పారు.
కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు జమ్ముకు చెందిన భారత ఆర్మీ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలియజేశారు.