(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయవాడ ఎంపి ఎంపి కేశినేని నాని, నేతలు మాగంటి బాబు, గల్లా అరుణకుమారి, రామనాయుడు,పంచుమర్తి అనురాధ, శ్రావణ్ కుమార్, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతవాసులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో నేడు నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే, నేడు రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి నిరసన దీక్షలు నిర్వహిస్తున్న రైతులు, మహిళలకు సంఘీభావం తెలియజేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.
ఎర్రబాలెం అనంతరం కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.