ఢిల్లీ: సార్వత్రికలలో భాగంగా సోమవారం ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో అయిదవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యంది.
పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తచేయడంతో ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యంది. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఉత్తరప్రదేశ్లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్లో 12, పశ్చిమ బెంగాల్లో ఏడు, మధ్యప్రదేశ్లో ఏడు, బీహార్లో ఐదు, ఝార్ఖండ్లో నాలుగు, జమ్మూకాశ్మీర్లో రెండు స్థానాలో పోలింగ్ ప్రారంభం అయ్యింది.
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీల ప్రముఖులు బరిలో ఉండడంతో పలు నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.