ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతొన్న ఆరవ విడత పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ల బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు సైతం బూత్ల క్యూలైన్లో సాధారణ ప్రజానీకం మాదిరిగా బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకోగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హరియాణా గుడ్గావ్లోని సైన్క్రెస్ట్ పాఠశాలలో ఓటు వేశారు. ఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోగా మాజీ క్రికెటర్, ఢిల్లీ తూర్పు బిజెపి అభ్యర్థి గౌతమ్ గంభీర్, ఆయన సతీమణితో కలిసి ఓల్డ్ రాజేంద్రనగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటి సిఎం సిసోడియో ఆయన సతీమణి సీమాతో కలిసి పాండవ్నగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భోపాల్ బిజెపి అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.