అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాల్లో జరుగుతున్న సర్దుబాట్లు ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా 30 మంది డిఎస్పిలను బదిలీ చేశారు. విశేషమేమంటే ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. అందరినీ పోలీసు హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.
నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట అప్పటి డిజిపి ఆర్.పి. ఠాకూర్నూ, ఎసిబి డిజిగా ఉన్న మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబి వెంకటేశ్వర రావునూ బదిలీ చేశారు. తర్వాత ఐఎఎస్. ఐపిఎస్ అధికారుల భారీ బదిలీలతో అధికార యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇప్పుడు ఇంకా కింది స్థాయిలో డిఎస్పిల బదిలీలు చేశారు. ఇంతమంది డిఎస్పిలను పోలీసు హెడ్ క్వార్టర్స్కు పంపించడం బహుశా అదే మొదటిసారేమో. డిజిపి గౌతం సవాంగ్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.