(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నెహ్రూ-గాంధీ కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు అయిన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. నెహ్రూ-గాంధీ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఐటీ యాక్ట్ కింద పాయల్ రోహత్గిని ఆదివారం రాజస్థాన్ పోలీసులు అహ్మదాబాద్లో అరెస్ట్ చేశారు. సోమవారం ఆమెను బుండీ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ కోసం పాయల్ రోహత్గి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు… ఆమెను డిసెంబర్ 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మోతీలాల్ కుటుంబాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర వీడియో పెట్టారంటూ రాజస్తాన్ యువజన నేత, ప్రధాన కార్యదర్శి అక్టోబర్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అహ్మదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను పోలీసులు అరెస్టు చేయడంపై పాయల్ తీవ్రంగా మండిపడింది. ‘గూగుల్లో దొరికిన సమాచారం ఆధారంగా మోతీలాల్పై ఒక వీడియోను రూపొందించడంతో పోలీసులు నన్ను అరెస్టు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ మరోసారి అపసహ్యం అయ్యింది’ అంటూ వ్యాఖ్యానించింది.
https://twitter.com/Payal_Rohatgi/status/1206074851276083200
సెప్టెంబర్ 21న పాయల్ రోహత్గి స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూతోపాటు జవహర్లాల్ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో రాజస్తాన్ కు చెందిన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ.. పాయల్ రోహత్గి మీద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్టోబర్ 12న ఆమెపై సెక్షన్ 66,67 కింద కేసు నమోదు చేశారు. కాగా, పాయల్ పలు హిందీ టీవీ, రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేగాకుండా కొన్ని బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.