అమరావతి: రాజకీయ విలువలు లేని టిడిపితో బిజెపి ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు చిడతల భజన చేసుకోవడమే అన్నట్లుగా ట్విట్టర్ వేదికగా చితలు పట్టుకొన్న చంద్రబాబు ఫోటోను ట్యాగ్ చేశారు కన్న.
అవినీతే లక్ష్యంగా అవకాశవాద రాజకీయాలతో యు టర్న్లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన టిడిపి ఇప్పుడు ఏ మొహంతో పొత్తు కోసం వెంపర్లాడుతోందని కన్నా ప్రశ్నించారు. టిడిపికి అమిత్షా శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారని కన్నా పేర్కొన్నారు.
రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఇక ఎప్పటికి పొత్తు పెట్టుకోదు.
అవినీతే లక్ష్యంగా అవకాశవాద రాజకీయాలతో U టర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన టీడీపీ..ఇప్పుడు ఏ మొహంతో పొత్తుకోసం వెంపర్లాడుతోంది??@AmitShah గారు టీడీపీకి శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారు. pic.twitter.com/Ss6LzJEnkM
— Kanna Lakshmi Narayana (@klnbjp) October 19, 2019
t