ఢిల్లీ: బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 184 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కేంద్రమంత్రి జేపి నడ్డా విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోది ఈసారి కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా మాత్రం ఆ పార్టీ అగ్రనేత అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
హోం మంత్రి రాజ్నాథ్ లక్నో నుంచి, కీలక నేత నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి పోటీ చేయనున్నారు.
తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఏపీలో రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు.
బిజెపి ఎంపి అభ్యర్థుల జాబితా:
- విశాఖ – పురందేశ్వరి
- నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ
- మల్కాజ్గిరి – రామచంద్రరావు
- సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
- మహబూబ్నగర్ – డీకే అరుణ
- నాగర్కర్నూలు – బంగారు శ్రుతి
- కరీంనగర్ – బండి సంజయ్
- నిజామాబాద్ – డి. అరవింద్
- నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్
- భువనగిరి – పీవీ శ్యామ్సుందర్ రావు
- వరంగల్ – చింతా సాంబమూర్తి
- మహబూబాబాద్ – హుస్సేన్నాయక్