కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్లోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని జార్గ్రామ్లో శనివారం రాత్రి బిజెపికి చెందిన ఒక కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పనేనని బిజెపి ఆరోపించింది. బిజెపి కార్యకర్త హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో పక్క ఈస్ట్ మిడ్నాపూర్లోని అనంత గుచైటీ, రంజిత్ మైటీ అనే ఇద్దరు బిజెపి కార్యకర్తలపై రాత్రి కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బిజెపి ఆరోపణలను తృణమూల్ ఖండించింది.
ఆదివారం పోలింగ్ జరుగుతున్న వేళ ఘతాక్ లోక్సభ బిజెపి అభ్యర్థిని, మాజీ ఐపిఎస్ అధికారిణి భారతీఘోష్పై పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. భారతీఘోష్ వాహనంపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలింగ్ ఏజెంట్లతో కలిసి బూత్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భారతి ఘోష్ను తృణమూల్ కాంగ్రెస్ మహిళా విభాగం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘోష్ను చుట్టుముట్టి ఆమెను తోసివేయడంతో కిందపడిపోయారు. తనపై దృణమూల్ కార్యకర్తలు దాడి చేశారంటూ ఆమె కన్నీళ్లు పెట్టున్నారు.
మోబైల్ ఫోన్తో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన భారతి ఘోష్ వీడియో తీశారనే ఆరోపణలపై ఈసి సంబంధిత పోలింగ్ అధికారులను నివేదిక కోరింది.