అమరావతి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శిరిడి సాయి మందిరంలో సాయిబాబా విగ్రహానికీ వైసిపి జెండాను కట్టారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఆలయ అర్చకుడు దీనిపై వివరణ ఇచ్చారు. అది ఒక భక్తురాలు స్వామివారి అలంకరణకు సమర్పించిన చీరె అని తెలిపారు. ఇది వైసిపి జండా పోలి ఉన్నది అన్న విషయం తమకు తెలియదని అన్నారు. ఇది తెలియక చేసిన పొరబాటుగా భావించి మన్నించాలనీ, భవిష్యత్తులో ఇటువంటి పొరబాట్లు జరగకుండా చూసుకుంటామనీ ఆలయ అర్చకుడు తెలియజేశారు.
స్వామివారికి అలంకరించిన చీరె వైసిపి జండా రంగులో ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇటీవల కాలంలో పాఠశాల ప్రహరీగోడలు, ప్రభుత్వ కట్టడాలు, వాటర్ ట్యాంక్లు, స్మశాన వాటిక తదితర కట్టడాలకు వైసిపి జండా రంగులు వేస్తుండటంతో ప్రతిపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.