NewsOrbit
టాప్ స్టోరీస్

అమరావతిపై 20వ తేదీ తర్వాత సిపిఎం కార్యాచరణ

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

విజయవాడ: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకునే వైఖరిని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నది. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మదు మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇతర ప్రాంతాలతో సమానంగా తీసుకురావాలని ప్రజలు కోరుకుంటుంటే దానికి భిన్నంగా ఒక ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని విమర్శించారు.

అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుదన్న ఉద్దేశంతో నాడు రాజధాని ప్రతిపాదనను వైసిపితో సహా అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయన్నారు. దాన్ని ఈ రోజు జగన్ ప్రభుత్వం వివాదం చేసి మూడు రాజధానుల పేరుతో వికేంద్రీకరణ చేస్తామనడం భావ్యం కాదని మధు పేర్కొన్నారు.  భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళనకు గురై నిరసనలు వ్యక్తం చేస్తుంటే వారిపై పోలీసుల నిర్భందం హద్దులు మీరుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మహిళల మీద సాగిస్తున్న దౌర్జన్యకాండను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల, వ్యాపారస్తుల, కూలీలందరి సమస్యలు ప్రభుత్వం విని పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అమరావతి పరిపాలనా రాజధానిగానే ఉండాలనీ, వెనకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టి ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలనీ, అలాంటి వికేంద్రీకరణ కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకున్నారని అన్నారు. దాన్ని వైసిపి పెద్దలు వక్రీకరించి అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరో చోట పెట్టడం ద్వారా అది పరిపాలనకు తోడ్పడదనీ, ప్రజలకు సౌలభ్యం కాదనీ మధు అన్నారు.అందరికీ అందుబాటులో ఉన్న అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక నిధులు, రైల్వే జోన్‌ ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపి.. రాజధాని గురించి ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. బిజెపి ద్వంద వైఖరినీ, అవకాశవాదాన్ని ఎండగట్టేందుకు వైసిపి ప్రభుత్వం, ఇతర రాజకీయపక్షాలు పూనుకోవాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. బిజెపి పట్ల టిడిపి కూడా అవకాశవాదంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రాజెక్టులు, నిధులు, ఇలాంటి వాటి కోసం అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని మధు పేర్కొన్నారు.

టిడిపి ప్రభుత్వం ప్రకటించిన రాజధాని మోడల్‌ను తాము మొదటి నుంచి తప్పుపడుతున్నామనీ, ఇప్పుడు కూడా అలాంటి మోడల్‌ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగానూ దోహదపడదనీ ఆయన అన్నారు.

రాజధాని మార్పుపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్న హైపవర్‌ కమిటీ నిర్ణయంపై మధు స్పందిస్తూ ఇప్పటి వరకూ చాలా మంది రాజధానిపై అభిప్రాయాలను తెలియజేశారనీ, ఇప్పుడు కూడా రాజధాని ప్రాంత రైతులు హైపవర్‌ కమిటీకి వివరిస్తారని అన్నారు.

రోజువారీ పరిపాలనతో సంబంధలేని హైకోర్టును రాయలసీమలో పెట్టడాన్ని, విశాఖ, అమరావతిలో బెంచీలు పెట్టడాన్ని ప్రజలు అంగీకరిస్తారని చెప్పారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలు చెప్పాలని ఒక పక్క  అంటూనే మరో పక్క సిఆర్‌డిఎను రద్దు చేయాలని ముసాయిదాను పెట్టారన్నాని విమర్శించారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండానే, వారితో చర్చించకుండానే ప్రభుత్వం ముందుకు వెళుతోందనీ, దీంతో ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment