NewsOrbit
టాప్ స్టోరీస్

ఢిల్లీ పీఠంపై మళ్లీ కేజ్రీవాల్..ఎగ్జిట్ పోల్స్ అంచనాలు!

 

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

న్యూఢిల్లీ: యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్న ఢిల్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దేశ రాజధాని ప్రజల ఆశీస్సులు అర్ధిస్తున్న ఈ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టాయి. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 52 సీట్ల వరకూ రావచ్చనీ, బిజెపికి 17 సీట్లు, కాంగ్రెస్‌కు మిగిలిన ఒక్క సీటు రావచ్చనీ ఎగ్జిట్ పోల్స్ సూచించాయి.

శనివారం ఉదయం నుంచీ పోలింగ్ మొదట మందకొడిగా సాగింది. ఈ మందకొడి పోలింగ్ దేనికి సంకేతం అంటూ పరిశీలకులు అంచనాలు వేస్తుండగానే పోలింగ్ పుంజుకుంది.  పోలింగ్ ముగిసేసరికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 67.08 శాతం వోట్ల పోలయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో 67.5 శాతం పోలింగ్ నమోదయింది.

2015 ఎన్నికలలో ఢిల్లీ శాసనసభలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67 సీట్లే గెలుచుకున్నది. మూడు సీట్లతో బిజెపి  ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నది. ఈసారి ఆ పరిస్థితి మార్చాలన్న కృత నిశ్చయంతో నరేంద్ర మోదీ, అమిత్ షాతో సహా 40 మంది స్టార్ కాంపైనర్లను బిజెపి రంగంలోకి దించింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.

అంతకు ముందు: 18:28 గంటలు

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మరో గంటలో పోలింగ్‌ ముగియనుంది. కానీ పోలింగ్‌ శాతం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 40.18శాతం మాత్రమే పోలింగ్‌ శాతం నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 28శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే సమయానికి 42 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగియనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా 1.47కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.      ముచ్చటగా మూడోసారి హస్తిన పీఠాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని అప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశిస్తుండగా ఎలాగైనా డిల్లీ గద్దెనెక్కాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తోంది. మళ్లీ అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని  కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది. 2015తో పోల్చుకుంటే ఈ ఏడాది ఓటింగ్‌ సరళి చాలా తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో 62.2 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment