న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానుల్లో అత్యంత మితవాదిగా పేరుపొందిన బెంజమెన్ నెతన్యాహూకూ, భారత ప్రధాని నరేంద్ర మోదీకి బాగా కుదిరింది. అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెతన్యాహూ నుంచి మోదికి ‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే’ సందేశం అందింది.
‘పటిష్టం అవుతున్న మన స్నేహం, భాగస్వామ్యం ఇంకా ఎదగాలి’ అంటూ ట్విట్టర్లో ఒక సందేశం పోస్టు చేశారు. సూపర్ హిట్ హిందీ చిత్రం షోలే లోని హిట్ సాంగ్ ‘యె దోస్తీ హమ్ నహీ తోడేంగే’లో మొదటి లైను కూడా అందులో రాశారు.
Happy #FriendshipDay2019 India!
May our ever strengthening friendship & #growingpartnership touch greater heights.
??? ये दोस्ती हम नहीं तोड़ेंगे….. ??❤?? pic.twitter.com/BQDv8QnFVj— Israel in India (@IsraelinIndia) August 4, 2019
గత నెలలో ఇజ్రాయెల్లో నెతన్యాహూ ఎన్నికల ప్రచారంలో మోదీ చిత్రం కనబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజధాని టెల్అవీవ్లో కట్టిన ఒక భారీ ఎన్నికల బ్యానర్లో నెతన్యాహూ, మోదీ కరచాలనం చేసుకుంటున్న ఫొటో ముద్రించారు.
ఇటీవలి ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నెతన్యాహూ విఫలం కావడంతో ఇజ్రాయెల్లో మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పోలింగ్కు ఎనిమిది రోజుల ముందు వచ్చే సెప్టెంబర్లో నెతన్యాహూ ఇండియా పర్యటనకు వస్తున్నారు. నెతన్యాహూ ఇండియా పర్యటనను ఎన్నికల స్టంట్గా ఆయన ప్రత్యర్ధులు అభివర్ణిస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో సాధించిన భారీ విజయానికి మోదీని అభినందించిన ప్రపంచ నాయకులలో నెతన్యాహూ మొదటివారు.