న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. మద్దతు కూడగట్టుకునే విషయంలో శివసేనకు మరింత సమయం ఇచ్చేందుకు నిరాకరించిన గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, శాసనసభలో మూడవ పెద్ద పార్టీ అయిన ఎన్సిపిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 8 30 గంటల వరకూ ఎన్సిపికి సమయమ ఇచ్చారు. మిత్రపక్షమైన కాంగ్రెస్తో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఎన్సిపి ప్రకటించింది.
అంతకుముందు (రాత్రి 8:29 గంటలు ):
మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చే విషయమై కాంగ్రెస్ ఇంకా ఎటూ తేల్చలేదు. ఎన్సిపి నేత శరద పవార్తో ఇంకా చర్చలు జరిపిన తర్వాతనే తమ నిర్ణయం తెలుపుతామని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేకు చెప్పినట్లు అభిజ్ఞవర్గాల భోగట్టా. అంతకుముందు మద్దతు ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా శివసేన నేతలు గవర్నర్ను కలవడానికి కూడా వెళ్లారని వార్తలు వచ్చాయి
అంతకుముందు (సాయంత్రం 7 :40 గంటలు ):
మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర దక్షిణ ధృవాలైన శివసేన, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు చేతులు కలిపాయి. శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బయటినుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ తమ మద్దతు తెలియజేసిన వెంటనే శివసేన నాయకులు రాజ్భవన్ వెళ్లారు.
సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనాయకత్వం మహారాష్ట్ర నేతలతో జరిపిన సమావేశంలో శివసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం సోనియా గాంధీ ఎన్సిపి నాయకుడు శరద్ పవార్కు ఫోన్ చేసి బయటనుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన విషయాన్ని తెలియజేశారు. ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన రంగంలోకి దిగింది.
అంతకుముందు (సాయంత్రం 5:57 గంటలు ):
శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి మాట్లాడారు. తమ నాయకులతో మాట్లాడిన తర్వాత తిరిగి ఫోన్ చేస్తానని సోనియా ఆయనకు చెప్పినట్లు తెలిసింది. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖంగా ఉన్న ఎన్సిపి, మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపితేనే ముందుకు వెళ్లాలనుకుంటున్నది.
ముంబైలో వినపడుతున్న ఊహాగానాల ప్రకారం ఉద్దవ్ థాక్రే మఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఎన్సిపి నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. కాంగ్రెస్ బయటినుంచి మద్దతు ఇస్తుంది. న్యూఢిల్లీ ముంబై మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్పై ఆధారపడిఉంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) శివసేనకు మద్దతు ఇచ్చే విషయమై ఆ పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపింది. ఆఖరుకు కాంగ్రెస్ ఏం చెబుతుందనేదానిపై తమ నిర్ణయం కూడా ఆధారపడిఉందని ఎన్సిపి తేల్చింది. సాయంత్రం నాలుగింటికి ఢిల్లీలో మహారాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమయింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ తుదినిర్ణయం తీసుకుంటుంది.
మధ్యాహ్నం శివసేన నేత ఉద్దవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ఎన్సిపి నేత శరద్ పవార్ను కలిశారు. కాంగ్రెస్ నాయకత్వం తమ వైఖరి తెలిపిన మీదట సాయంత్రం వారు మరోసారి పవార్ను కలుస్తారు. మద్దతు ఇవ్వాలంటే కనీస ఉమ్మడి కార్యక్రమం ఒకటి రూపొందించాలని శరద్ పవార్ శివసేనతో అంటున్నారు.
ముంబై కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో ఉన్న ఏకైక శివసేన మంత్రి అరవింద్ సావంత్ సోమవారం తన రాజీనామా ప్రకటించారు. దీనితో భారతీయ జనతా పార్టీకీ, శివసేనకూ మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే. ప్రభుత్వం ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ నుంచి అందిన ఆహ్వానాన్ని బిజెపి తిరస్కరించిన సంగతి తెలిసిందే. దరిమిలా ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించారు.
శివసేనతో పొత్తు పెట్టుకునే విషయం ప్రాధమికంగా చర్చించాలన్నా ముందు శివసేన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఎన్సిపి నేత శరద్ పవార్ షరతు విధించారు. దానికోసం అరవింద్ సావంత్ రాజీనామా చేశారు.
ఇప్పుడు శివసేనతో పొత్తు గురించి ఎన్సిపి చర్చించే అవకాశాలు మెరుగయ్యాయి. శరద్ పవార్ తన పార్టీ శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. మరో పక్క కాంగ్రెస్ కూడా తాజా పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఢిల్లీలో సమావేశం కానున్నది.
శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఫోన్ చేసి మాట్లాడారు. తమ నాయకులతో మాట్లాడిన తర్వాత తిరిగి ఫోన్ చేస్తానని సోనియా ఆయనకు చెప్పినట్లు తెలిసింది. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖంగా ఉన్న ఎన్సిపి, మిత్రపక్షమైన కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపితేనే ముందుకు వెళ్లాలనుకుంటున్నది.
ముంబైలో వినపడుతున్న ఊహాగానాల ప్రకారం ఉద్దవ్ థాక్రే మఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఎన్సిపి నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. కాంగ్రెస్ బయటినుంచి మద్దతు ఇస్తుంది.
అంతకుముందు (సాయంత్రం 4: 31 గంటలు ):
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్పై ఆధారపడిఉంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) శివసేనకు మద్దతు ఇచ్చే విషయమై ఆ పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపింది. ఆఖరుకు కాంగ్రెస్ ఏం చెబుతుందనేదానిపై తమ నిర్ణయం కూడా ఆధారపడిఉందని ఎన్సిపి తేల్చింది. సాయంత్రం నాలుగింటికి ఢిల్లీలో మహారాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమయింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ తుదినిర్ణయం తీసుకుంటుంది.
మధ్యాహ్నం శివసేన నేత ఉద్దవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ఎన్సిపి నేత శరద్ పవార్ను కలిశారు. కాంగ్రెస్ నాయకత్వం తమ వైఖరి తెలిపిన మీదట సాయంత్రం వారు మరోసారి పవార్ను కలుస్తారు. మద్దతు ఇవ్వాలంటే కనీస ఉమ్మడి కార్యక్రమం ఒకటి రూపొందించాలని శరద్ పవార్ శివసేనతో అంటున్నారు. మెజారిటీ నిరూపించుకునేందుకు ఈ రోజు సాయంత్రం 7 : 30 గంటల వరకూ గవర్నర్ శివసేనకు సమయం ఇచ్చారు
అంతకుముందు (ఉదయం 11;43 గంటలు ):
కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వంలో ఉన్న ఏకైక శివసేన మంత్రి అరవింద్ సావంత్ సోమవారం తన రాజీనామా ప్రకటించారు. దీనితో భారతీయ జనతా పార్టీకీ, శివసేనకూ మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే. ప్రభుత్వం ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్ నుంచి అందిన ఆహ్వానాన్ని బిజెపి తిరస్కరించిన సంగతి తెలిసిందే. దరిమిలా ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించారు.
శివసేనతో పొత్తు పెట్టుకునే విషయం ప్రాధమికంగా చర్చించాలన్నా ముందు శివసేన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఎన్సిపి నేత శరద్ పవార్ షరతు విధించారు. దానికోసం అరవింద్ సావంత్ రాజీనామా చేశారు.
ఇప్పుడు శివసేనతో పొత్తు గురించి ఎన్సిపి చర్చించే అవకాశాలు మెరుగయ్యాయి. శరద్ పవార్ తన పార్టీ శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. మరో పక్క కాంగ్రెస్ కూడా తాజా పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఢిల్లీలో సమావేశం కానున్నది.