(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మోటర్ సైకిల్ దొంగిలించాడన్న అనుమానంతో స్ధంబానికి కట్టేసి ఎనిమిది గంటల సేపు కొడుతూనే ఉన్నారు. కొనఊపిరితో పోలీసులకు అప్పగించారు. చివరికి ఆ అభాగ్యుడు శనివారం కన్నుమూశాడు. జార్ఖండ్లో సెరాయికెలా జిల్లా, తూర్పు సింగ్భూమ్ జిల్లా సరిహద్దులో ఈ దారుణం జరిగింది.
గత మంగళవారం 24 ఏళ్ల షామ్స్ తబ్రేజ్ స్నేహితులతో కలిసి ఇంటికి వెళుతున్నాడు. ఆ ప్రాంతంలో అంతకుముందు జరిగిన ఒక మోటర్సైకిల్ దొంగతనం వీళ్లే చేసి ఉంటారన్నఅనుమానంతో స్థానికులు వారిని పట్టుకున్నారు. తబ్రేజ్ స్నేహితులు ఇద్దరూ తప్పించుకుని పారిపోయారు. దొరికిపోయిన తబ్రెజ్ను చితకకొట్టారు. జైశ్రీరాం , జై హనుమాన్ అని నినాదాలు చేయించారు. బుధవారం తెల్లవారిన తర్వాత స్పృహ లేని తబ్రేజ్ను పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తబ్రేజ్ను స్థానిక ఆసపత్రిలో చూపించి లాకప్లో పెట్టారు. చూడడానికి వెళ్లిన అతని అన్నయ్యను బెదిరించి పంపించారు. తబ్రేజ్ ఆరోగ్యం క్షీణించేసరికి జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే తబ్రేజ్ చనిపోయినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. పోలీసులు వెంటనే తగిన వైద్యం చేయిస్తే తబ్రేజ్ ప్రాణాలు పోయేవికావని అతని కుటుంబసభ్యులు అంటున్నారు. తబ్రేజ్ను కట్టేసి కొడుతున్న సెల్ఫోన్ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
https://youtu.be/nK55Fpvd7Bs