న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. పిడిపి నేత మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోన్లను గృహనిర్బంధంలో ఉంచారు.
ఈ చర్యపై స్పందిస్తూ, చిదంబరం కశ్మీర్లో మోదీ ప్రభుత్వం ఏదో ఒక దుస్సాహసానికి పాల్పడుతుందని తాను ముందే హెచ్చరించాననీ, ఇప్పుడు తన అనుమానాలే నిజం అయ్యేట్లున్నాయనీ ట్వీట్ చేశారు. ఈ ప్రభుత్వం తమ లక్ష్య సాధన కోసం అన్ని ప్రజాస్వామిక నియమాలనూ తుంగలో తొక్కగలదనడానికి కశ్మీర్ నేతల గృహనిర్బంధం తార్కాణం అని ఆయన వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్లో తీవ్రమైన సంక్షోభం తలెత్తేదీ లేనిదీ ఈ రోజు గడిచే లోపు తేలిపోతుంది అని ఆయన పేర్కొన్నారు.
The house arrest of J&K leaders is a signal that the government will defy all democratic norms and principles to achieve its objects. I condemn the house arrests.
— P. Chidambaram (@PChidambaram_IN) August 5, 2019
మరో కాంగ్రెస్ నేత శశి ధరూర్ కూడా కశ్మీర్ పరిణామాలపై స్పందించారు. ఒమర్ అబ్దుల్లాను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, మీరు వంటరిగా లేరు. ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నదో దానిని కశ్మీర్లో ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల వెంట ప్రజాస్వామిక భారతీయులందరూ నిలబడతారు. పార్లమెంట్ సమావేశాలు ఇంకా జరుగుతున్నాయి. మా గొంతులు నొక్కలేరు అని పేర్కొన్నారు.
What is going on in J&K? Why would leaders be arrested overnight while having done no wrong? If Kashmiris are our citizens &their leaders our partners, surely the mainstream ones must be kept on board while we act against terrorists & separatists? If we alienate them, who’s left?
— Shashi Tharoor (@ShashiTharoor) August 4, 2019
తనను గృహనిర్బంధంలో ఉంచిన తర్వాత ఒమర్ అబ్దుల్లా వరసగా ట్వీట్లు చేస్తూ ఏం జరగబోతున్నదీ తెలియడం లేదనీ, కానీ వాతావరణం సవ్యంగా కనబడడం లేదనీ పేర్కొన్నారు. ఏం జరిగినా సంయమనం పాటించాలనీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించవద్దనీ పేర్కొన్నారు.