కాగా నవీన్ పట్నాయక్ కు చరాస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు, నగదు అన్నీ కలిపి రూ. 23 లక్షల విలువ చేస్తాయి. ఇవి 2014 నాటితో పోలిస్తే రూ. 5 లక్షలు ఎక్కువ. కాగా స్థిరాస్తులు మాత్రం 2014లో దాదాపు రూ. 12 కోట్ల విలువ చేస్తుంటే, ఇప్పుడు వాటి విలువ బాగా పెరిగి రూ. 64 కోట్లు అయింది. వాటిలో ఒక ఆస్తి ఆయనకు తన సోదరి గీతతో కలిపి ఉంది. న్యూఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో గల ఇల్లు రూ. 43 కోట్లు చేస్తుండగా, ఒడిశాలోని నవీన్ నివాస్ రూ. 9.52 కోట్లు చేస్తోంది. ఆయన వద్ద చేతిలో రూ. 25 వేల నగదు, 1980 మోడల్ నాటి అంబాసిడర్ కారు ఉన్నాయి. ఆ కారు విలువ రూ. 9వేలుగా పేర్కొన్నారు. గత 19 ఏళ్లుగా నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా ఉన్నారు. తొలిసారి ఆయన రెండు నియోజకవర్గాలు.. బీజేపూర్, హింజిలి నుంచి పోటీ చేస్తున్నారు.
previous post
next post