మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామీ అసిమానంద్ను నిర్దోషిగా విడుదల చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కోర్టు న్యాయమూర్తి రవీంద్రా రెడ్డి బిజెపిలో చేరారంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. విచిత్రం ఏమంటే పలువురు ప్రముఖ జర్నలిస్టులు ఈ అబద్ధపు వార్తను నమ్మి ప్రచారంలో పెట్టారు.
మొదట జర్నలిస్టు సౌరవ్ దత్తా ఫేస్బుక్ స్క్రీన్ షాట్ ఒకటి జోడించి ఈ ఫేక్ న్యూస్ను ట్వీట్ చేశారు. తర్వాత నిజం తెలిసి దానిని డిలీట్ చేశారు.
సౌరవ్ ట్వీట్ తర్వాత సదానంద్ ధూమే, నిధి రాజ్దాన్, స్వాతి చతుర్వేది వంటి పలువురు ప్రముఖలు ట్విట్టర్లో ఈ బూటకపు వార్త పెట్టారు. తర్వాత అందరూ దానిని తొలగించి వివరణ ఇచ్చారు.
ఫేకూ ఎక్స్ప్రెస్ అనే ఫేస్బుక్ పేజి మొదట ఈ ఫేక్ న్యూస్ ప్రచారంలో పెట్టింది. సౌరవ్ దత్తా ఉటంకించిన సోర్స్ కూడా ఆ ఫేస్బుక్ పేజినే కాపీపేస్ట్ చేశారు. నిజానికి అందులో పెట్టిన ఫొటో రవీంద్రా రెడ్డిది కాదు. ఫొటోలో కాషాయం కండువా వేసుకుని అమిత్ షా పక్కనున్న వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రామ్దయాళ్ వుయకే. గత సంవత్సరం అక్టోబర్లో ఆయన బిజిపిలో చేరారు.
నిజానికి మక్కా మసీదు పేలుళ్ల కేసులో తీర్పు తర్వాత పదవికి రాజీనామా చేసిన రవీంద్రా రెడ్డి 2018 అక్టోబర్లో తెలంగాణా జనసమితిలో చేరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సంజయ్ హెగ్డెను మాటలను పేర్కొంటూ ట్వీట్ చేసారు.
क्या हमारी न्याय प्रक्रिया का मज़ाक़ नही है? जो व्यक्ति असीमानंद को रिहा करता है वो जज भाजपा में शामिल हो जाता है। https://t.co/BR2RI79ASO
— Sanjay Singh AAP (@SanjayAzadSln) March 29, 2019
సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఒక ఫేక్ న్యూస్ నిజానిజాలను విచారించకుండా ఇంతమంది దానిని ఇంకా చలామణీ చేశారు.
‘ఆల్ట్ న్యూస్’ వెబ్సైట్ సౌజన్యంతో