చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మద్రాసు ఐఐటీలో జరిగిన 56వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు ఆయనకు ఎయిర్ పోర్టులో తమిళనాడు ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో తాను తమిళ కవి గురించి చేసిన ప్రస్తావన, అమెరికాలోని పలు వేదికలపై తమిళ భాష ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. ప్రాచీన భాషలలో తమిళ భాష కూడా ఒకటి అని మోదీ అన్నారు. ఈ భాషని అందరికీ నేర్పించాలన్నారు. అందరికి వనక్కం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి తమిళ భాషలో మాట్లాడాను. ఇది ప్రాచీన భాషలలో ఒకటి అని అందరికీ చెప్పా. ఇప్పటికీ తమిళ భాష మొత్తం అమెరికాలో ప్రతిధ్వనిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.
Speaking at Chennai Airport. Watch. https://t.co/7qWBSkMO5R
— Narendra Modi (@narendramodi) September 30, 2019
ప్రధాని అమెరికా పర్యటనకు ముందు కేంద్ర హోంమత్రి అమిత్ షా ఒకే దేశం ఒకే భాష అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. హిందీని తమపై బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని దక్షిణాది రాష్ట్రాలు నిరసనలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా తమిళనాడులో అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమయ్యాయి. డిఎంకే అధినేత స్టాలిన్ సహా తమిళ నటుటు కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తీవ్రం మండిపడ్డారు. దీంతో హిందీ దివాస్ రోజున తాను మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించానని అమిత్ షా వివరణ ఇచ్చారు.