అమరావతి : పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్గా ఉన్న వెంకటేశ్వరరావు పోలవరం చీఫ్ ఇంజినీర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్గా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఏ) సభ్యుడిగానూ ఆయన్ను తొలగించారు.
వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా చీఫ్ ఇంజినీర్ సుధాకర్బాబును ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.