అమరావతి: పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందం రద్దు విషయంలో వైసిపి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఆదిలోనే హంసపాదు ఎదురయింది.
నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్కో జారీ చేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్ట్ పనుల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వులతో పోలవరం పనులు నవయుగ సంస్థే నిర్వహించే అవకాశముంది.
పోలవరం పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ ఫై ముందుకు వెళ్లవద్దని పోలవరం ప్రాజెక్టు అధారిటీ లేఖ రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకోకుండా రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ కూడా జారీచేసిన విషయం తెలిసిందే.