అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని5
న్యూఢిల్లీ: కశ్మీర్ పరిణామాల నేపధ్యంలో పాకిస్థాన్తో సంబంధాలు ఉద్రిక్తంగా మారిన వేళ రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ అణ్వాయుధాల ప్రయోగానికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదన్న పాలసీని ఎప్పుడైనా మార్చుకునే హక్కు ఇండియాకు ఉందని ఆయన పోఖరాన్లో అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ప్రధమ వర్ధంతి సందర్భంగా పోఖరాన్లో ఆయనకు రాజనాధ్ సింగ్ నివాళులు అర్పించారు. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నపుడే 1998లో పోఖరాన్లో రెండవసారి అణుపరీక్ష నిర్వహించారు. మొదటిసారి ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు 1974లో నిర్వహించారు.
అణ్వాయుధాలను మొదట ప్రయోగించరాదన్న విధానానికి ప్రభుత్వం గట్టిగా కట్టుబడిఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని రక్షణ మంత్రి అన్నారు. 2014 ఎన్నికలకు బిజెపి ప్రకటించిన మ్యానిఫెస్టోలో భారత అణ్వాయుధ విధానంలో మార్పులు అన్న అంశం కూడా ఉంది. అయితే నరేంద్ర మోదీని ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు, వాజ్పేయీ ప్రకటించిన గొప్ప విధానమది. దాని విషయంలో రాజీ లేదు. మొదట అణ్వాయుధాలను వాడకూడదన్న విధానం మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రాజనాధ్ సింగ్ మాటలను తగిన సమయంలో పాకిస్థాన్కు పంపిన హెచ్చరికగా భావిస్తున్నారు.
యోగించరాదన్న విధానానికి ప్రభుత్వం గట్టిగా కట్టుబడిఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని రక్షణ మంత్రి అన్నారు. 2014 ఎన్నికలకు బిజెపి ప్రకటించిన మ్యానిఫెస్టోలో భారత అణ్వాయుధ విధానంలో మార్పులు అన్న అంశం కూడా ఉంది. అయితే నరేంద్ర మోదీని ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినపుడు, వాజ్పేయీ ప్రకటించిన గొప్ప విధానమది. దాని విషయంలో రాజీ లేదు. మొదట అణ్వాయుధాలను వాడకూడదన్న విధానం మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తుంది అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రాజనాధ్ సింగ్ మాటలను తగిన సమయంలో పాకిస్థాన్కు పంపిన హెచ్చరికగా భావిస్తున్నారు.