హైదరాబాద్: ఆర్టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హస్తినాపూర్లోని తన నివాసంలో నిన్నటి నుండి ఆయన దీక్ష చేస్తున్నారు. గృహ నిర్బంధంలో దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు.
అశ్వత్థామరెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తరలించే క్రమంలో పోలీసులను ఆర్టిసి కార్మికులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది.
కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.