(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ మన దేశానికీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వైరస్ సోకిన వ్యక్తి ఇటీవలే చైనాలో పర్యటించినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదయింది. బాధితురాలు చైనాలోని వుహాన్ నగరంలో చదువుకుంటున్నారు. వైరస్ తీవ్రతకు భయపడి కేరళకు తిరిగి వచ్చింది. ఆమె నుంచి నమూనా తీసుకుని పుణెకు పంపించగా కరోనా సోకినట్లు ధ్రువీకరించారు. ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.