న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా పార్టీ నేతలంతా ఆమోదించారు. ఇప్పుడు ఆమె లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఎవరిని నియమిస్తారో చూడాలి.
గత ఐదేళ్లుగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున్ ఖర్గే కర్నాటకలోని కలబురిగి లోక్సభ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వయనాడ్ నుంచి లోక్సభకు ఎన్నికయిన రాహుల్ గాంధీని ఆ పదవి వరిస్తుందా లేక సోనియా మరెవరినన్నా నియమిస్తారా అన్నది తేలలేదు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీమానా సమర్పించారు. అయితే రాహుల్ రాజీనామాను సిడబ్ల్యూసి తిరస్కరించింది. అమెఠీ లోక్సభ స్థానం నుండి రాహుల్ పరాజయం పాలయ్యారు. కేరళలోని వాయినాడ్ లోక్సభ స్థానం నుండి గెలిచారు. పార్టీ అధ్యక్ష బాధ్యత తిరిగి స్వీకరించకపోయినా కనీసం లోక్సభలో పార్టీ నాయకత్వం బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.