ఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కుట్రకోణాన్ని విచారణ జరిపించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకె పట్నాయక్ను సుప్రీం కోర్టు నియమించింది.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై కొందరు కావాలని కక్షకట్టి కుట్ర పన్నుతున్నారని న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ఉదయం విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ అవసరమని అభిప్రాయానికి వచ్చి సుప్రీంకోర్ట్ రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్తో విచారణ జరిపించాలని నిర్ణయించింది.
జస్టిస్ ఏకే పట్నాయక్ విచారణకు సిబిఐ, నిఘా విభాగం డైరెక్టర్లు, ఢిల్లీ పోలీస్ కమీషనర్లు సహకరించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణ అనంతరం జస్టిస్ పట్నాయక్ నిజానిజాలు సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిస్తారని ధర్మాసనం పేర్కొన్నది.
సీజేఐ రంజన్ గొగోయ్పై వచ్చిన ఆరోపణలు ఈ దర్యాప్తు పరిధిలోకి రావని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కుట్ర వ్యవహారంపై మాత్రమే విచారణ జరుగుతుందని తెలిపింది.