అమరావతి, ఏప్రిల్ 5: పౌరుషానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్పూర్తితో తెలుగుజాతి కీర్తి చాటుతూ ఈ కాగడాల ప్రదర్శన నిర్వహిద్దామని చంద్రబాబు అన్నారు.
40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన ప్రధాన మంత్రిని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర వ్యవస్థలను ఇష్టానుసారంగా వాడుకుంటూ టిడిపిపై దాడులు చేయిస్తుందని చంద్రబాబు ఆరోపించారు.
కుట్రలను ఎదుర్కునేందుకు ఈ నెల ఎడవ తేదీ అన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.
వ్యక్తిగత జీవితాలను దిగజార్చుకుంటూ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఉగాది పండుగ సందర్భంగా శనివారం పార్టీ మానిఫెస్టో విడుదల చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.