అమరావతి: 15మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఏపి అసెంబ్లీలో సోమవారం సీఆర్డీఏ రద్దు బిల్లుపై జరుగుతున్న చర్చలో గందరగోళం నెలకొన్నది.సి ఎం జగన్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపి సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
సీఎం జగన్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
దీనితో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, కరణం బలరాం, ఆదిరెడ్డి భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిని స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.