అమరావతి: జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. ఆదివారం అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పవన్ అవగాహన లేకుండా మాట్లాడినట్టు ఉందని వ్యంగ్యంగా విమర్శించారు.
ఇసుక విధానం పై ఏమైనా అనాలంటే ఆలా కుప్పల దగ్గరకు వెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని పవన్ కు ఎవరైనా చెప్పండయ్యా అని విజయసాయి రెడ్డి సూచించారు. ఇసుకను కిలో , పది కిలోల ప్యాకేజి ల్లో అమ్మరని కూడా పవన్ కు తెలియచేయాలని విజయసాయి రెడ్డి అన్నారు. ఇల్లు కట్టు కున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు, అందుకే ఆయనకు రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ తాను ఇసుక డంపింగ్ యార్డ్ సందర్శించాననీ, టన్ను ఇసుకకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే మరో 550 రూపాయలు వసూలు చేస్తున్నారనీ ఆరోపించిన విషయం విదితమే.
ఇసుక విధానం మీద ఏదైనా అనాలంటే అలా కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయనవసరం లేదని చెప్పండయ్యా ఎవరన్నా.ఇసుకును కిలో, పది కిలోల ‘ప్యాకేజీ’ల్లో అమ్మరని కూడా తెలియపర్చండి. ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్రీగా అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి రవాణా ఖర్చుల గురించి ఐడియా లేనట్టుంది. @PawanKalyan
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 15, 2019