మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన అవి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తున్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారు. గంజాయి, నల్లమందు, హెరాయిన్, కొకైన్, బ్రౌన్ షుగర్, చెర్రస్ తదితర మాదక ద్రవ్యాలు అయస్కాంతం లాంటివి. ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే అది చాల పొరపాటు ఎందుకంటే అది పదే, పదే ఆ మత్తు కావాలనిపించే లా చేస్తుంది.
ఒక్కసారి కూడా దాని జోలికి పోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మత్తులో తేలడం తప్ప తిండిపై ధ్యాస ఉండదు.మద్యం తాగితే కిక్ వస్తుంది . సిగరేట్ కాల్చితే విశ్రాంతి గా అనిపిస్తుంది. గంజాయి దమ్ము పీల్చితే తెలియని లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే డ్రగ్స్ తీసుకుంటే ప్రపంచమే సొంతమైనంత ఆనందం కలుగుతుంది. కానీ ఇదంతా తాత్కాలికమే ,వట్టి భ్రమేనని, శారీరకంగా, మానసికంగా అలిసిపోయి ఉన్న మనిషి ఊహించుకుంటూ ఉర్రూతలూగే మార్పు తప్ప నిజం గా అందులో ఏమీ ఉండదని మానసిక నిపుణులు చెబుతున్నారు.
డ్రగ్స్ తీసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే. వీటికి అలవాటు పడిన వారు దాని నుండి బయట పడడం అంత సులువు కాదు. ఇలాంటి కొంతమంది పై చేసిన పరిశోధనల లో భాగంగా గంజాయి ఎక్కువగా వాడేవారు వాడని వారికన్నా ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నట్టు తేలింది. అంతేకాదు మాదకద్రవ్యాలు తీసుకునేవారి లో ఇతరుల తో పోలిస్తే 20 శాతం అధికంగా శృంగార కోరికలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు .
డ్రగ్స్ తీసుకున్న వారికి శృంగారంలో పాల్గొనాలని కోరిక ఎక్కువగా కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటి వల్ల శృంగార వాంఛ తాత్కాలికం గా పెరిగిన, భవిష్యత్తు లో మాత్రం సంతాన సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి ఎక్కువగా తీసుకునే వారికి పిల్లలు పుట్టే అవకాశం బాగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంతవరకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం మంచిది .. నిజానికి వీటిని ఉపయోగించడం చట్టపరంగా కూడా నేరమే. కాబట్టి వీటిని తీసుకున్నట్లు రుజువైతే కఠిన కారాగారశిక్ష కూడా పడుతుంది కాబట్టి ఇలాంటి ఉచ్చు లో పడకుండా జాగ్రత్త గా ఉండడం అవసరం .