ఈ రోజుల్లో ప్రతీఒక్కరూ చైర్స్, డైనింగ్ టేబుల్ కి అలవాటుపడి అలా భోజనం చేస్తున్నారు . కానీ, ఈ పద్దతి ఎంతమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పాతకాలం పద్దతి లాగా నేలపై కూర్చొని తింటే ఎన్నో ప్రయోజనాలుంటాయని ముఖ్యంగా బరువుపెరగమని చెబుతున్నారు. నేల మీద కూర్చొని తింటే మనకు ఎంత ఆకలిగా ఉంటే అంతే భోజనం తింటాము. కాబట్టి ఊబకాయానికి అవకాశం ఉండదు.అలా కింద కూర్చు నే పద్ధతి వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది.
మనం పూర్వకాలంలో పాటించే ఎన్నో విషయాలు ఆరోగ్య సంబంధితమైనవని, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నవని చెబుతున్నారు.మనం నేలపై సుఖాసనంలో కూర్చొని అన్నం తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరగడం తో పాటు శరీరభాగాలకు సమానంగా రక్తప్రసరణ జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, ఉదర సంబంధిత సమస్యలు రావని చెబుతున్నారు. ఇలా నేలపై కూర్చొని తినడం వల్ల నడుంనొప్పి కూడా తగ్గుతుందనిఅంటున్నారు .
నేలపై కూర్చోవడం వల్ల యోగా లో సుఖాసనం వేసినట్టు అవుతుంది. ఆ భంగిమలో ఉండి తినేటప్పుడు మాటి మాటికీ ముందుకు వంగుతాం .. అలా వంగే సందర్భంలో జీర్ణకోశం వద్ద ఉండే కండరాలు సాగిన ఫలితంగా తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. అందుకే నేలపై కూర్చుని తినడం మంచిది.నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల గుండెకు రక్త సరఫరా సరిగా జరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. అదే కుర్చీ లో కూర్చుని భోజనం చేస్తే రక్త సరఫరా కేవలం కాళ్లకు మాత్రమే జరుగుతుంది. అది ఆరోగ్యనికి అంత మంచిది కాదు.