Health Boosters: ప్రపంచ మొత్తంలో ఒక సంవత్సరానికి రెండు కోట్ల టన్నుల రసాయనాలను కూల్ డ్రింక్స్ రూపంలో జనాలు తాగేస్తున్నారు.. కూల్ డ్రింక్స్ అమ్మకాలు పెంచుకొనేందుకు కంపెనీలు సినిమా తారలతో వ్యాపార ప్రకటనలు ఇచ్చి అసత్య ప్రచారాన్ని బాగా చేస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పర్యావరణవేత్తలు, మేధావులు కూల్ డ్రింక్స్ ను నిషేధించి , ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆందోళన చేసిన పూర్తి ప్రయోజనం దగ్గలేదు.
ఇంకా చెప్పాలంటే భారత దేశంలో పార్లమెంట్ క్యాంటీన్ లో శీతలపానీయాలు పూర్తిగా నిషేధించారు.
కానీ దేశం మొత్తం మీద ముఖ్యంగా యువత కూల్ డ్రింక్స్ తాగడం హోదా గా భావించి తెగ తాగేస్తున్నారు.
దాదాపు కూల్ డ్రింక్స్ కంపెనీలు అన్ని విదేశాలకు చెందినవే. ఈ విధం గా ప్రతిరోజు వేల కోట్ల రూపాయలు విదేశీ కంపెనీ లకు మనమే దోచి పెడుతున్నాము అనడంలో ఎలాంటి సందేహం లేదు.మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న విదేశీ కంపెనీల ను అభివృద్ధి చేయడం కన్నా కూల్ డ్రింక్స్ మానేసి స్వదేశీ పానీయాలు అయినా చెరుకు రసం, కొబ్బరి బొండాలు, పళ్లరసాలు, మజ్జిగ వంటివి తాగడం వలన మనకు ఆరోగ్యం తో పాటు మన రైతులు ఆర్ధికం గా బలపడతారు.
కిట్ కేట్లలో దూడ మాంసం నుండి వచ్చే రసం కలుపుతామని నెస్లే కంపెనీ స్వయంగా అంగీకరించింది.
వేరుశెనగ గింజల నుండి నూనె తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది. దీనీతో హార్లిక్స్, బోర్నవీటా,మాల్టోవ, ప్రోటీన్ ఎక్స్ ,బూస్ట్ తయారవుతాయి. ఢిల్లీ లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ పరిశోధనలో ఈ విషయం తేలింది.మామూలుగా అయితే ఈ పిప్పిని పల్లెటూర్లలో పశువులకు బలం కోసం పెడతారు.