అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ 25 రూపాయల చొప్పున అందిస్తున్నామని జగన్ తెలిపారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపుల్లో కేజీ ఉల్లి ఎంత అమ్ముతున్నారో తెలుసా అంటూ కేజీ 200 రూపాయలకు విక్రయిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు పొలాల్లోనే పంటను వదిలివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇతర ప్రాంతాల నుండి ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నామని జగన్ అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?