(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.
జగనన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన,వసతి కోసం ఐటిఐ చదువుకుంటున్న వారికి ఏడాదికి 10వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి ఏడాదికి 15వేలు రూపాయలు చెల్లిస్తారు. డిగ్రీ ఆ పై చదువులు చదువుతున్న వారికి ఏడాదికి 20వేలు అందిస్తారు.
విద్యార్థుల వసతికోసం గతంలో 500 కోట్లు ఖర్చు చేశారనీ, ఇప్పుడు జగనన్న వసతి దీవెన కింద ఏటా 2300 కోట్లు ఖర్చు చేస్తామనీ ప్రభుత్వం తెలిపింది. ఫీజు రీఇంబర్స్మెంట్ కోసం గతంలో 1800 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇకమీదట జగనన్న విద్యా దీవెన కింద ఏటా 3400 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.