అమరావతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమ్మినేని వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్పై విజయవాడ పోలీస్ కమిషనర్ తిరుమలరావుకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. వైసీపీ మంత్రులు, స్పీకర్ బాషా వ్యవహార శైలిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. స్పీకర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీని కోరామని తెలిపారు. తమ్మినేని స్పీకరా..? లేదంటే బ్రోకరా..? అని ప్రశ్నిస్తున్నానన్నారు. సీఎం జగన్ వెంటనే స్పీకర్ను బర్తరఫ్ చేయాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధిలోని రావివలస గ్రామంలో ఎండల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో స్పీకర్ తమ్మినేని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తిరుమల ఆలయం ప్రవేశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు… తమ్మినేని స్పందిస్తూ.. ” జగన్ ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి పెరిగాడు. ఆయన గర్వించదగ్గ భారతీయు పౌరుడు. సోనియా గాంధీ విదేశీయురాలు, ఆమెకు ద్వంద పౌరసత్వాలు ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.
‘ఎవరు మాట్లాడుతున్నారది? నేను అడుగుతున్నాను… ఈవేళ ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి సోనియాగాంధీతో చేతులు కలిపి రాజకీయ లం..త్వానికి పాల్పడలేదా! ఎలా మాట్లాడతారు జగన్మోహన్రెడ్డి కోసం!’ అంటూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడేశారు.
దీంతో టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. తమ్మినేని సీతారాం చేసిన అసభ్యకర వాఖ్యలపై మండిపడుతున్నారు. రాజ్యాంగ పరమైన, బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలా మహిళల గురించి బూతులు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తమ్మినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://youtu.be/rFBFKkZbzLc