(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీ కార్యాలయ నిర్మాణంలో ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి, కలెక్టర్, టిడిపికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. అయితే ఈ నోటీసుపై టిడిపి ఇంత వరకూ స్పందించలేదు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన టిడిపి జాతీయ కార్యాలయాన్ని ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే.