ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. వేగంగా వస్తున్న బస్సు, ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బావిలో ముందు ఆటో పడడం, దాని మీదే బస్సు పడిపోవడంతో ఆటోలో ఉన్న వారంతా నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక అందరూ చనిపోయారు. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా దియోలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో ఆటో, బస్సు ఒకదానికొకటి ఢీకొని.. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్ర పెరిగిందని అధికారులు తెలిపారు.
previous post
next post