అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొద్ది సేపటి క్రితం మంత్రివర్గ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించనున్నారు. ప్రధానంగా ఏపిఎస్ ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడం, నూతన ఇసుక విధానం, టిటిడి పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 25 కు పెంపు, మత్స్యకారులకు డీజిల్పై ఇచ్చే సబ్సిడిని ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకు పెంపు అంశాలను క్యాబినెట్ ఆమోదించనుంది. అదే విధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు రివర్స్ టెండెరింగ్, రాజధాని అమరావతి నిర్మాణాలు, ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నాణ్యమైన రేషన బియ్యం పంపిణీ, సంక్షేమ పథకాల అమలు,నిధుల సమీకరణ తదితర అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
previous post
next post