న్యూఢిల్లీ: సుప్రీెంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన మహిళ దానిపై విచారణకు ఏర్పాటయిన ముగ్గురు న్యాయమూర్తుల కమిటీ ముందు ఇక హాజరు కాబోనని ప్రకటించారు. తాను కోరినట్లు బయటి వ్యక్తులతో కమిటీ కాకుండా సిజెఐకి జూనియర్లు అయిన సిట్టింగ్ జడ్జిల కమిటీతో తనకు న్యాయం జగుతుందని భావించడం లేదని పేర్కొంది.
కమిటీలో వాతావరణం భయపెట్టేలా ఉందనీ, తన న్యాయవాది లేకుండా ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రశ్నలు ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించిందని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు.
ఈ ప్రొసీడింగ్స్ను వీడియో రికార్డింగ్ చేయాలన్న తన విజ్ఞప్తిని కమిటీ తిరస్కరించిందనీ, తాను కోరినట్లు వాగ్మూలం తాలూకు ప్రతులను అందజేయడం లేదని ఆమె ఆరోపించారు.
సీజెఐ రంజన్ గొగొయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు జస్టిస్ బోబ్డే, జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో సుప్రీం ప్యానల్ ఏర్పాటు చేయగా జస్టిస్ ఎన్ వి రమణ సిజెఐకి అత్యంత సన్నిహితుడని పిర్యాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో త్రిసభ్య ప్యానల్ నుండి ఎన్ వి రమణ స్వచ్చందంగా తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో జస్టిస్ ఇందు మల్హోత్రాని సభ్యురాలిగా చేర్చారు.