న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు సభలో ఉచ్ఛారణ దోషం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు డిల్లీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సుభాష్ చోప్రా హజరయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు సురేంద్ర కుమార్ సభలో ఆ పార్టీ నేతలకు జిందాబాద్ చెప్పే సమయంలో ప్రియాంక గాంధీ వద్రా పేరు బదులు ప్రియాంక చోప్రాగా పేరు ఉచ్చారణ చేయడం సభలో నవ్వులు పూయించాయి. ఆయన బిగ్గరగా సోనియా గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్ అనడంతో పార్టీ కార్యకర్తలు అందరూ కోరస్గా జిందాబాద్ అన్నారు, అదే మాదిరిగా ప్రియాంక చోప్రా అనడంతో అందరూ జిందాబాద్ కొట్టారు. కాసేపటి తర్వాత జనాలు తేరుకొని నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై అకాళీదళ్ నేత మంజిందర్ ఎస్ సిర్సా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ప్రియాంక చోప్రాకు జేజేలు పలుకుతున్నారు, పార్టీ మొత్తం పప్పు’ అంటూ ట్వీట్ చేశారు.
#WATCH Delhi: Slogan of "Sonia Gandhi zindabad! Congress party zindabad! Rahul Gandhi zindabad! Priyanka Chopra zindabad!" (instead of Priyanka Gandhi Vadra) mistakenly raised by Congress' Surender Kr at a public rally. Delhi Congress chief Subhash Chopra was also present.(01.12) pic.twitter.com/ddFDuZDTwH
— ANI (@ANI) December 1, 2019
कांग्रेस पार्टी की रैली में प्रियंका चोपड़ा ज़िंदाबादके नारे लग रहे हैं
लगता है पूरी पार्टी ही पप्पू है ? pic.twitter.com/BLZLube4Po
— Manjinder Singh Sirsa (@mssirsa) December 1, 2019