న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు గురువారం ఉదయం తీహార్ జైల్లో కలిశారు. దాదాపు 20 నిమిషాలకు పైగా చిదంబరంతో సమావేశం అయ్యారు. చిదంబరంను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని, త్వరలోనే కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు చిదంబరం బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు అక్టోబర్ 22న బెయిల్ మంజూరు చేసింది. అయితే,మనీలాండరింగ్ కేసులో ఈడీ అక్టోబర్ 16న అదుపులోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు.
Delhi: Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi Vadra arrive at Tihar Jail to meet Congress leader P Chidambaram pic.twitter.com/u1wGFv8uuo
— ANI (@ANI) November 27, 2019