(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ భగత్సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ విధానసభ సభ్యుడు కాదు కాబట్టి పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలల లోగా ఆయన శాసనసభ్యుడుగా ఎన్నిక కావాల్సిఉంటుంది.
#WATCH Shiv Sena Chief & 'Maha Vikas Aghadi' (NCP-Congress-Shiv Sena alliance) CM candidate, Uddhav Thackeray and his wife Rashmi meet #Maharashtra Governor Bhagat Singh Koshyari at Raj Bhawan. #Mumbai pic.twitter.com/cubFSPPPHR
— ANI (@ANI) November 27, 2019
ప్రోటెం స్పీకర్ కాళిదాస్ కోలాంబ్కర్ శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్సిపి నాయకులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, పృధ్వీరాజ్, శివసేన సభ్యుడు ఆదిత్య థాక్రే ముందు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఒకసారి బిజెపితో కలిసి మళ్లీ సొంతగూటికి వచ్చిన అజిత్ పవార్ ప్రమాణస్వీకారం కోసం పోడియం దగ్గరకు వెళుతున్నపుడు ఎన్సిపి సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచారు.