హైదరాబాద్: టివి 9షేర్ల లావాదేవీల కేసులో రవిప్రకాష్తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు శివాజీని నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన్ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలందా మీడియా యాజమాన్యం పెట్టిన కేసులో నిందితుడైన శివాజీకి సైబరాబాదు పోలీసులు నోటీసులు జారీ చేసినా విచారణకు హజరుకాకుండా రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లభించలేదు. ఈ నేపథ్యంలో శివాజీ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు.
నేడు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. శివాజీని సైబరాబాదు క్రైమ్ పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు శివాజీని అరెస్టు చేయకుండా సిఆర్పిసి 41 కింద నోటీసు జారీ చేశారు. ఈ నెల 11న విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.